వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభకు దేశం అభ్యర్థుల ఖరారు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాజ్యసభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపేర్లు ఖరారయ్యాయి. సినీ ప్రముఖులెవరికీ రాజ్యసభసీట్లు దక్కడం లేదు. తెలుగుదేశం పార్టీ బుధవారంనాడు నలుగురు పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది.

తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యుడు లాల్‌జాన్‌ బాష, పార్టీ అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యుడు ఆకారపు సుదర్శన్‌, చిత్తూరు జిల్లాకు చెందిన దుర్గపేర్లు ఖరారయ్యాయి. బుధవారం అమావాస్య కావడంతో అభ్యర్థులపేర్లను అధికారికంగా ప్రకటించకూడదని నిర్ణయించారు.

బుధవారం రాత్రి పార్టీ ముఖ్యులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విస్తృతంగా చర్చించిన అనంతరం ఆపేర్లను ఖరారు చేశారు. రాజ్యసభ కోసం పార్టీ టికెట్లకు దరఖాస్తు చేసుకున్న వారిపేర్లను ముఖ్యమంత్రి సమావేశంలో వెల్లడించారు. దాదాపు 30పేర్లు ఆయన చదివి వినిపించారు. ప్రస్తుతం నాలుగుసీట్లలో రెండు తెలంగాణకు, కోస్తాకు, రాయలసీమకు ఒక్కటేసిసీట్లు కేటాయించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X