వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దినేష్‌కు చోటు- యువరాజ్‌కు నో

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: జింబాబ్వేతో జరిగిన రెండు వన్డే మ్యాచ్‌లలో విజృంభించి ఆడిన యువరాజ్‌ సింగ్‌కు వెస్టిండీస్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ సిరీస్‌లో తలపడే భారత జట్టులో స్థానం లభించలేదు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌ల్లోవిశేష ప్రతిభ కనబరిచిన దినేష్‌ మోంగియాకు స్థానం లభించింది. గాయాల బారిన పడి జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లకు దూరంగా వున్న సచిన్‌ టెండూల్కర్‌, అనిల్‌ కుంబ్లే, శ్రీనాత్‌ వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే జట్టులో వున్నారు.

సెలెక్షన్‌ కమిటీ సమావేశానంతరం భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి నిరంజన్‌ షా వెస్టిండీస్‌ టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపిక 16 మంది జట్టు సభ్యులపేర్లను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎడమ చేతి వాటం ఫాస్ట్‌ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రాకు తిరిగి జట్టులో స్థానం లభించింది. కొత్తగా ముంబాయికి చెందిన వాసిం జాఫర్‌కు మాత్రమే జట్టులో చోటు కల్పించారు.

అజయ్‌ రాత్రాతో పాటు దీప్‌ దాస్‌గుప్తాను కూడా జట్టులోకి ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాలో ఆడే ఇండియా ఎ జట్టుకు దినేష్‌ మోంగియా నాయకత్వం వహించాల్సి వుండింది. అయితే, దినేష్‌ మోంగియా వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే జట్టులోకి ఎంపికయినందున ఇండియా ఎ జట్టుకు జాకబ్‌ మార్టిన్‌ నాయకత్వం వహిస్తాడని, మోంగియా స్థానంలో యువరాజ్‌ సింగ్‌ ఆడుతాడని షా చెప్పారు.

వెస్టిండీస్‌తో మే 25వ తేదీ నుంచి జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టును తర్వాత ఎంపిక చేస్తారు. రెండు నెలల వెస్టిండీస్‌ పర్యటన కోసం భారత జట్టు ఏప్రిల్‌ 1వ తేదీ రాత్రి బయలుదేరి వెళ్తుంది.

జట్టు: సౌరబ్‌ గంగూలీ (కెప్టెన్‌), రాహుల్‌ ద్రావిడ్‌ (వైస్‌-కెప్టెన్‌), సచిన్‌ టెండూల్కర్‌,వివియస్‌ లక్ష్మణ్‌, సంజయ్‌ బంగర్‌, దినేష్‌ మోంగియా, శివసుందర్‌ దాస్‌, అజయ్‌ రాత్రా, జవగళ్‌ శ్రీనాథ్‌, జహీర్‌ఖాన్‌, అనిల్‌ కుంబ్లే, హర్బజన్‌ సింగ్‌, ఆశిష్‌ నెహ్రా, టిను మోహానన్‌, వాసిం జాఫర్‌, దీప్‌ దాస్‌ గుప్తా.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X