వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుపాకులతో కాల్పులవిరమణా?: డిజిపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తుపాకులు దగ్గర వుంచుకుని కాల్పులవిరమణ అంటే ఏమిటని పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి)పేర్వారం రాములు పీపుల్స్‌వార్‌ నక్సలైట్లను ప్రశ్నించారు.కాల్పుల విరమణ అంటే ఏమిటి? తుపాకులు దగ్గర వుంచుకుని కాల్పులవిరమణ అంటే ఏమిటి? అని ఆయన అడిగారు.

నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నల్లగొండ, తదితర జిల్లాలకు చెందిన 22 మంది నక్సలైట్లు గురువారం డిజిపి ముందు లొంగిపోయారు. ఈ సందర్భంగా డిజిపివిలేకరులతో మాట్లాడారు. చర్చల పట్ల పీపుల్స్‌వార్‌ నక్సలైట్లుసీరియస్‌గా వుంటే తుపాకులతో ఎందుకు సమావేశమవుతారని ఆయన వరంగల్‌ జిల్లా తుపాకులగూడెం వద్దపీపుల్స్‌వార్‌ తలపెట్టిన సమావేశాన్ని ఉద్దేశించి అడిగారు. ఇక్కడ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగినవిషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌ గురించి ఆయన ప్రస్తావిస్తూ- యుద్ధానికి తయారవుతుంటే ఏ ప్రభుత్వం మాత్రం ఊరుకుంటుంది. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు అని ఆయన అన్నారు. ప్రభుత్వానికి, నక్సలైట్లకు మధ్య చర్చలను పోలీసులు అడ్డుకుంటున్నారనేవిమర్శలను ఆయన ఖండించారు.

లొంగిపోయిన నక్సలైట్లలో పీపుల్స్‌వార్‌ ఏరియా కమిటీ కార్యదర్శి బండకంటిగోపి, తుపాకులగూడెం ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్న దుప్పటి రమేష్‌ కూడా ఉన్నారు. తుపాకులగూడెం వద్ద 70 మంది నక్సలైట్లు సమావేశమైనట్లు దుప్పటి రమేష్‌ చెప్పాడు. ఎన్‌కౌంటర్‌ నాటికి సమావేశం ప్రారంభమై రెండు రోజులవుతోందని, ఇది 15 రోజులు జరగాల్సిన సమావేశమని అతను చెప్పాడు. ఇలాంటి సమావేశాలు జరిగే సందర్భాల్లో సమావేశం ముగిసిన తర్వాత దగ్గరలోని పోలీసుస్టేషన్‌పై నక్సలైట్లు దాడి చేయడం ఆనవాయితీ అని అతను వెల్లడించారు.పీపుల్స్‌వార్‌ చర్చల పట్ల ఆసక్తి కనబరుస్తోందని బండకంటి గోపి చెప్పాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X