వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవ హక్కుల ముట్టడి

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌ః గుజరాత్‌లో ఇటీవల జరిగిన మతకల్లోలపై విచారణ జరుపుతున్న జాతీయ మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జెఎస్‌ వర్మ కారును గురువారం నాడు అహ్మదాబాద్‌లో కొందరు వ్యక్తులు ముట్టడించి మానవహక్కుల కమిషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అహ్మదాబాద్‌లోని సర్క్యూట్‌ హౌస్‌ల బస చేసిన జస్టిస్‌ వర్మ బుధవారం రాత్రి చాలాసేపటివరకు బాధితుల వాదనలను విన్నారు. గురువారం నాడు సర్క్యూట్‌ హౌస్‌ ఆవరణలోని తన కారు వద్దకు వస్తుండగా హఠాత్తుగా నలుభై మంది వ్యక్తులు ఆయన్ను చుట్టుముట్టి కమిషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారంతా సాధువులు, సన్యాసుల వేషధారణలో వున్నట్టుగా పోలీసులు చెప్పారు. భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని జస్టిస్‌ వర్మ కారుకు మార్గాన్ని క్లియర్‌ చేసింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X