వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెరుకు రైతులకుమిగిలింది చేదు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్రంలో చెరుకు రైతుల కడగండ్లపై ప్రభుత్వం ప్రతిస్పందనను గురువారం నాడు అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా తూర్పారబట్టారు. చెరుకు రైతులకు ఇప్పుడు లభిస్తున్న ధర మూడేళ్ల క్రితం నాటిదని కాంగ్రెస్‌ నేత వైఎస్‌ వ్యాఖ్యానించారు.

ఇరుగు పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్రలో చెరుకు రైతులకు టన్నుకు 11 వందల రూపాయల వరకు లభిస్తుండగా ఇక్కడ కనీస మద్దతు ధర 620 రూపాయలు మాత్రమే లభిస్తున్నదని ఆయనవిమర్శించారు. రైతులను ప్రైవేట్‌ ఫ్యాక్టరీలకు అమ్ముకునేందుకు అనుమతించాలని ఇతర మార్కెట్లలో ఉత్పత్తిను అమ్ముకునేందుకు సహకరించాలని కాంగ్రెస్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. చెరుకు రైతుల సమస్యపై ప్రభుత్వం మాట్లాడేందుకు నిరాకరించడంతో వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X