వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌పేయిపై మిత్రులవిశ్వాసం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని వాజ్‌పేయి నాయకత్వంపై సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలు, మిత్ర పక్షాలువిశ్వాసం వ్యక్తం చేశాయి. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) భాగస్వామ్య పక్షాలు ప్రధాని వాజ్‌పేయి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యాయి.

ఎన్‌డిఎ ఎజెండాకు కట్టుబడి వుండాలని ఈ సమావేశం నిర్ణయించినట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మమతా బెనర్జీ సమావేశానంతరంవిలేకరులతో చెప్పారు. భాగస్వామ్య పక్షాల నుంచి వాజ్‌పేయి ప్రభుత్వానికి ముప్పు లేదని ఆమె చెప్పారు. ఎన్‌డిఎ పక్షాల మధ్య సమన్వయం మరింత పెరగడానికి తరుచూ సమావేశాలు ఏర్పాటు జరగాలని సమావేశం అభిప్రాయపడింది. పొటోకు భాగస్వామ్య పక్షాలు పూర్తి మద్దతు ప్రకటించాయి.అంతకుముందుజాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ఎజెండాకు కచ్చితంగా కట్టుబడి వుండాలని బిజెపి భాగస్వామ్య పక్షాలు హెచ్చరించాయి. లోక్‌సభలో ఈ నెల 21వ తేదీన జరిగిన సంఘటనను ఈ పక్షాలు ఖండించాయి.

ఎన్‌డిఎ సమావేశానికి గంట ముందు బిజెపి మిత్ర పక్షాలు శుక్రవారం సమావేశమయ్యాయి. తమ నాయకులు తమ ఉద్దేశాలను ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయికి విన్నవిస్తారని మిత్ర పక్షాలు చెప్పాయి. ఈ సమావేశానికి శివసేనను కూడా ఆహ్వానించనున్నట్లు ఈ నెల 21వ తేదీన ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు చెప్పాయి. అయితే, ఈ సమావేశానికి శివసేనహాజరు కాలేదు. ఏడు పార్టీల ప్రతినిధులు ఈసమావేశంలో పాల్గొన్నారు.

ఎన్‌డిఎ ఉమ్మడి కనీస కార్యక్రమం నుంచి ప్రభుత్వం వైదొలగకూడదని, లేకపోతే దేశంలో మత సామరస్యందెబ్బ తింటుందని, దేశ లౌకిక లక్ష్యాలు దెబ్బతింటాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సుదీప్‌ బంధోపాధ్యాయవిలేకరులతో చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X