వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రంలో జల మిత్ర అవార్డులు
హైదరాబాద్:
జల
వనరుల
సంరక్షణకు
అమలు
చేస్తున్న
నీరు-మీరు
కార్యక్రమంలో
ఉత్తమ
ఫలితాలు
సాధించినవారికి
జల
మిత్ర
అవార్డులు
ఇస్తామని
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
చెప్పారు.
ఈ
మేరకు
ఆయన
శుక్రవారం
శాసనసభలో
ఒక
ప్రకటన
చేశారు.
ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం వివిధ పార్టీల ప్రతినిధులు ఈఅంశంపై మాట్లాడారు. ఇంకుడు గుంతలు వంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జేబులు నింపడానికి కాకుండా చిత్తశుద్ధితో అమలు చేస్తే తాము సహకరిస్తామని ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. చెరువులు నిర్మించుకోవడానికి ముందుకు వచ్చే ప్రజలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) సభ్యుడుకె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వానికి సూచించారు.
Comments
Story first published: Friday, March 22, 2002, 23:53 [IST]