వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రంలో జల మిత్ర అవార్డులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: జల వనరుల సంరక్షణకు అమలు చేస్తున్న నీరు-మీరు కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించినవారికి జల మిత్ర అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం శాసనసభలో ఒక ప్రకటన చేశారు.

భూగర్భ జల వనరుల పరిరక్షణకు ప్రభుత్వం పదేళ్ల కార్యాచరణ పథకాన్ని అమలు చేస్తుందని ఆయన చెప్పారు.పేదరికానికి, జల వనరులకు మధ్య అవినాభావ సంబంధం ఉన్నదనేది ప్రపంచ వ్యాప్తంగాఅంగీకరిస్తున్న విషయమేనని, జల వనరుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆయన అన్నారు. ఇంత వరకు మూడు విడతలు చేపట్టిన నీరు-మీరు కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చిందని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం వివిధ పార్టీల ప్రతినిధులు ఈఅంశంపై మాట్లాడారు. ఇంకుడు గుంతలు వంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జేబులు నింపడానికి కాకుండా చిత్తశుద్ధితో అమలు చేస్తే తాము సహకరిస్తామని ప్రతిపక్ష నాయకుడు డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. చెరువులు నిర్మించుకోవడానికి ముందుకు వచ్చే ప్రజలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) సభ్యుడుకె. చంద్రశేఖర్‌ రావు ప్రభుత్వానికి సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X