వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీ పడబోము: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ఎజెండాకు కట్టుబడి వుండాలని తాము కేంద్రానికి స్పష్టంగా చెప్పామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు అన్నారు. పార్టీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీల శిక్షణా శిబిరం సమావేశంలో శుక్రవారం ప్రసంగించారు.

మత తత్వంతో సహా దేనిమీదా తాము రాజీపడబోమని ఆయన స్పష్టం చేశారు. మత సామరస్యం కోసం తాము ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతామని ఆయన అన్నారు. ఎన్‌డిఎ ఎజెండా నుంచి వైదొలగవద్దని తాము కేంద్రానికి పలు మార్లు సూచించినట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం అవకాశ వాద రాజకీయాలు చేస్తోందని సిపిఎం చేసినవిమర్శను ఆయన ఖండించారు. సిపిఎం ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు.

కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్న సిపిఎం కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి ప్రయత్నిస్తోందని ఆయనవిమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X