వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల్ని వేధించి చంపుతున్న ప్రభుత్వం!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్రంలో నానాటికిపెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలపై శుక్రవారంఅసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్న వరంగల్‌ జిల్లాలో సహకార బ్యాంకుల ఉద్యోగులు బలవంతంగా రుణాలు వసూలు చేస్తున్నారని, అవమాన భారంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ సభ్యుడు రెడ్యానాయక్‌ ఆరోపించారు. జీరో అవర్‌ లో రెడ్యానాయక్‌ ఈఅంశాన్ని ప్రస్తావించారు.

జీరో అవర్‌ లో లేవనెత్తినఅంశంపై చర్చించడాన్ని స్పీకర్‌ ప్రతిభాభారతి వ్యతిరేకించారు. వరంగల్‌ జిల్లాలో రైతుల ఇంట్లో సామాన్లు వీధుల్లో పడేస్తున్న సహకార సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈఅంశాన్ని నోట్‌ చేసుకున్నామని, తగు చర్యలు తీసుకుంటామంటూ సహకార మంత్రి చిక్కాల రామచంద్రరావు ముక్తసరిగా సమాధానం ఇవ్వడంతో సభలో తీవ్ర గందరగోళం తలెత్తింది. ఓ వైపు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మంత్రి ఇంత తేలికగావిషయాన్ని కొట్టిపారేస్తున్నరని వై.ఎస్‌. ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X