వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అస్థికల యాత్ర లేదు: విహెచ్‌పి

By Staff
|
Google Oneindia TeluguNews

అయోధ్య: గోద్రా మృతులఅస్థికలతో దేశ వ్యాప్త యాత్ర నిర్వహించాలని తాము నిర్ణయించుకోలేదనివిశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి) శుక్రవారం స్పష్టం చేసింది. ఈఅంశంపై పార్లమెంటులో చర్చ జరిగినందుకు విహెచ్‌పి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ భాయ్‌ తొగాడియా సంతృప్తి వ్యక్తం చేశారు.

గోద్రాలో మరణించిన రామసేవకులకు సంతాపం ప్రకటించే తమ హక్కును లాగేసుకోవడం ద్వారా తమను తాము లౌకిక పార్టీలుగా చెప్పుకుంటున్న పార్టీలు హిందూ మతంపై ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తున్నాయని ఆయనవిమర్శించారు. కాశ్మీర్‌లో హిందువుల ఊచకోతపై ఈ పార్టీలు నోరు మెదపడం లేదని ఆయన తప్పు పట్టారు. దేశంలో హిందూ సమాజం అభద్రతకు గురవుతోందని, వారి గౌరవాన్ని కాపాడుకునేవిషయం విహెచ్‌పితో ముడిపడి ఉన్నదని ఆయన అన్నారు.

అయోధ్యలోని వివాదస్పమైన, వివాదాస్పదం కాని 67 ఎకరాల భూమిని తిరిగి పొందడానికి తదుపరి ఉద్యమం చేపడుతామని, ఇందుకు కార్యక్రమాన్ని ఖరారు చేసుకోవడానికి మత నాయకులు హరిద్వార్‌లో గానీ, హృషికేశ్‌లో గానీ లేదా ఏ ఇతర మత ప్రాధాన్య ప్రాంతంలో సమావేశమవుతారని ఆయన చెప్పారు.

వచ్చే జూన్‌ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే తదుపరి దశ ఉద్యమం కోసం మూడు కార్యక్రమాలను ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. అవి ప్రతి రోజూ రామ నామ జపం చేయడం, గ్రామాల్లో వారానికి ఒక సారి రామ నామ జపం చేయడం, అయోధ్యలో రామ నామ జప యజ్ఞం అని ఆయనవివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X