వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతిపక్షాలనే మార్చలేకపోతున్నా: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పరిస్థితులకు అనుకూలంగా ప్రజలను మార్చగలిగినా ప్రతిపక్షాలను మార్చలేకపోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.విద్యుత్‌ ఛార్జీల పెంపును ప్రతిపక్షాలు వ్యతిరేకించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ నియోజక వర్గ స్థాయి శిక్షణా శిబిరంలో బుధవారం ఆ విధంగా అన్నారు.

తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సమస్యలు తీర్చలేని కాంగ్రెస్‌ మన రాష్ట్రంలో మాత్రంవిద్యుత్‌ ఛార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రంలో మెరుగ్గా, తక్కువ ధరకు కరెంట్‌నుఅందిస్తున్నామని ఆయన చెప్పారు. ఆ రాష్ట్రాల సంగతి నాకెందుకు అని మొండి వితండ వాదం చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్‌కు తామేమి చెప్పగలమని ఆయన అన్నారు.

తన కార్యాలయం వద్ద ప్రతిపక్షాలు మోక్‌ అసెంబ్లీని నిర్వహించడాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్షాల సభ్యులు తన వద్దకు వస్తారని అనుకున్నానని, కానీ తన కార్యాలయం వద్ద కూర్చుని ఆందోళన చేశారని ఆయన అన్నారు.

ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద మోక్‌అసెంబ్లీ నిర్వహించడంపై రాష్ట్ర మంత్రులు తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల తీరును మంత్రులు యనమల రామకృష్ణుడు, కడియం శ్రీహరి, కోటగిరి విద్యాధరరావువిలేకరుల సమావేశంలో విమర్శించారు. తక్కువ ఛార్జీలకు కరెంట్‌ను రైతులకుఅందజేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటేనని వారన్నారు. ప్రతిపక్షాల ఆందోళనలోఅర్థం లేదని వారు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది చివరికి సబ్సిడీపెరిగే అవకాశం ఉన్నదని వారు చెప్పారు. సంస్కరణల్లో భాగంగానే రెగ్యులేటరీ కమిషన్‌ కరెంట్‌ ఛార్జీలుపెంచిందని వారన్నారు. మొత్తం సబ్సిడీ ఇస్తే రెగ్యులేటరీ కమిషన్‌ ఎందుకని వారు ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X