వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాయకత్వ మార్పు లేదు: మోడి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్రంలో నాయకత్వ మార్పు వాజ్‌పేయితో జరిగిన సమావేశంలో చర్చకు రాలేదని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి చెప్పారు. నరేంద్ర మోడి బుధవారం వాజ్‌పేయితో దాదాపు గంటన్నరసేపు సమావేశమయ్యారు.

తన ప్రభుత్వ పని తీరు పట్ల వాజ్‌పేయి సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన వాజ్‌పేయితో సమావేశమైన అనంతరంవిలేకరులతో చెప్పారు. గుజరాత్‌లో పరిస్థితి అదుపు గురించి ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారా, రాష్ట్రంలో నాయకత్వ మార్పిడికి సంబంధించి చర్చ జరిగిందా అనివిలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఆ విధంగా చెప్పారు.

గుజరాత్‌ రాష్ట్రాన్ని సందర్శించాలన్న తన విజ్ఞప్తిని ప్రధానిఅంగీకరించారని మోడి చెప్పారు. మానవ హక్కుల కమిషన్‌ గుజరాత్‌లోని పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టినవిషయాన్ని విలేకరులు ప్రస్తావించగా తాము కమిషన్‌కు ఈ రోజే నివేదికఅందజేశామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీ కూడా పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X