వార్పై, మద్దుతుదారులపై పొటా: డిజిపి
హైదరాబాద్:
నిషిద్ధపీపుల్స్వార్
గ్రూప్పై,
దాని
మద్దతుదారులపై
ఉగ్రవాద
నిరోధక
చట్టాన్ని(పొటా)
ప్రయోగించనున్నట్లు
పోలీసు
డైరెక్టర్
జనరల్పేర్వారం
(డిజిపి)
రాములు
చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ
నిషేధానికిగురైన
పీపుల్స్వార్ను
పొటా
కింద
ఉగ్రవాద
సంస్థల
జాబితాలో
చేర్చినట్లు
ఆయన
బుధవారంవిలేకరుల
సమావేశంలో
చెప్పారు.
పీపుల్స్వార్ సాయుధ తీవ్రవాదులు 650 నుంచి 700 మంది దాకా వుంటారని ఆయన అన్నారు. పోలీసులు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మంగళవారం నాడు పోలీసులుపెద్ద యెత్తున ఆయుధాల డంప్లను కనుక్కున్నారని ఆయన చెప్పారు.
కొత్తగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని దుబ్బగూడెం వద్ద అటవీ ప్రాంతంలో ఆయుధాల డంప్ను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్ నుంచి ఎనిమిది డిబిబిఎల్ గన్స్ను, ఒక 303రైఫిల్ను, వంద రౌండ్ల స్ప్రింగ్ఫీల్డ్ ఆయుధ సామగ్రిని, 1,485 రౌండ్ల 8ఎంఎం ఆయుధ సామగ్రిని, 200 రౌండ్ల ఎకె-47రైఫిళ్లను, 70 రౌండ్ల .45 రివాల్వర్లను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని సిర్నాపల్లి అటవీ ప్రాంతంలో మరో డంప్ను పోలీసులు కనిపెట్టారు. ఇక్కడి నుంచి 586 గ్రెనేడ్లను, 1934 గ్రెనేడ్ బేసెస్నుస్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని అడవిముత్తారం పోలీసుస్టేషన్ పరిధిలోని సింగంపల్లి అడవుల్లో ఆయుధాలు, మందు గుండు సామగ్రిని పోలీసులుస్వాధీనం చేసుకున్నారు.
తీవ్రవాద
ఉద్యమంపై
భ్రమలు
తొలిగిపోయి
చాలా
మందిపీపుల్స్వార్
కార్యకర్తలు
లొంగిపోతున్నట్లు
పేర్వారం
రాములు
చెప్పారు.
1999లో
1,428
మంది
తీవ్రవాదులను
లేదా
సానుభూతిపరులనుఅరెస్టు
చేసినట్లు
ఆయన
తెలిపారు.
ఈ
సంఖ్య
రెండు
వేలనాటికి
3,080కి,
2001నాటికి
3,872కుపెరిగిందని
ఆయన
చెప్పారు.
ఈ
ఏడాది
ఇప్పటి
వరకు
169
మందినిఅరెస్టు
చేసినట్లు
ఆయన
తెలిపారు.