వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రామాల నుంచి ఉద్యమం: ఎమ్మెస్సార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా గ్రామ స్థాయి నుంచి ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు చెప్పారు. ఇంతకు ముందు పై నుంచి కిందికి ఉద్యమాన్ని నిర్మించామని, ఇప్పుడు కింది నుంచి పై స్థాయికి ఉద్యమాన్ని నిర్మించాలనుకుంటున్నామని ఆయన చెప్పారు.

విద్యుత్‌ ఛార్జీలపెంపుపై ఎన్‌ఎస్‌యుఐ చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ బ్యాలెట్‌ను ఆయన బుధవారం కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు.విద్యుత్‌ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనకు కలిసి రావాలని ఆయనమిగతా ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నిర్ణయంతో ఆందోళన రూపాలను ఖరారు చేసుకుంటామని ఆయన చెప్పారు. తమ కార్యవర్గ సభ్యుల, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆందోళనను ఖరారు చేసుకుంటామని ఆయన చెప్పారు. వచ్చే మొదటి వారంలో జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X