వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోలీ లో విషాదం-12మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత టెలీకమ్‌ రెగ్యులేటరీ అథారిటీ సూచనల మేరకు భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌) గృహ, అంతర్జాతీయ సుదూర టెలిఫోన్‌సర్వీసు రేట్లను తగ్గించింది. తగ్గించిన రేట్లు ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.

ఐఎస్‌డివిషయంలో పల్స్‌ రేట్‌ను పెంచడం ద్వారా రేట్లను తగ్గించింది.పీక్‌ అవర్‌లో పల్స్‌ రేటును 2.8 సెకన్ల నుంచి 3.3సెకన్లకు పెంచింది. దక్షిణాసియా ప్రాంతీయ సహకారం సంఘం(సార్క్‌) దేశాలకు, ఆఫ్రికా, యూరోప్‌, గల్ఫ్‌, ఆసియా, ఓసియానాల్లోని ఇతర పొరుగు దేశాలకు పల్స్‌ రేటు 1.8 నుంచి 2.3సెకన్లకు పెరుగుతుంది. అదే రీతిలో అమెరికా ఖండంలోని ప్రాంతాలకు, పాశ్చాత్య ప్రాంతాలకు పల్స్‌ రేటును 1.5 నుంచి 1.8సెకన్లకు పెంచడం ద్వారా రేటు తగ్గించింది.

ఇంతకు ముందు చెప్పిన కెటగిరీలకు ఆఫ్‌ పీక్‌ అవర్స్‌లో కొత్త పల్స్‌ రేట్లు వరుసగా 3.3 నుంచి 3.8సెకన్లకు, 2.1 నుంచి 2.6 సెకన్లకు, 1.7 నుంచి 2 సెకన్లకుపెరుగుతాయి.

భారత కాలమానం ప్రకారం- పీక్‌ అవర్స్‌ అమెరికాకు ఇతర దేశాలకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, మళ్లీ సాయంత్రం ఆరు నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు; ఐరోపా దేశాలకు ఉదయం 11 నుంచి రాత్రి పది గంటల వరకు; ఇతర దేశాలకు ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు. ఆదివారాల్లో, జాతీయసెలవు దినాల్లో (జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్‌ 2 తేదీల్లో) 24 గంటలూపీక్‌ అవర్సే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X