వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి ఓటమికి ప్రభుత్వం కారణమే: ప్రధాని

By Staff
|
Google Oneindia TeluguNews

నైనీటాల్‌: ఇటీవలిఅసెంబ్లీ ఎన్నికల్లో, ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఓటమికి ప్రభుత్వం కొంత వరకు కారణమని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. ఈ విషయంలో ఆత్మపరిశీలన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇటీవలి నాలుగు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో, ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో బిజెపి ఓటమికి కేంద్ర ప్రభుత్వం కొంత వరకు కారణమేనని, ఫలితాలవిషయంలో పార్టీలో ఆత్మపరిశీలన, విశ్లేషణ అవసరమని ఆయన అన్నారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో ఓటమి తప్పదని అనుకున్నప్పటికీ, ఫలితాలు ఇంత దారుణంగా వుంటాయని వూహించలేదని ఆయన అన్నారు.

ఢిల్లీ స్థానిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణాల్లో కేంద్రబడ్జెట్‌ ఒకటని ఢిల్లీ బిజెపి పార్లమెంటు సభ్యులు, ఇతర నేతలువిమర్శలు చేసిన నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన చేశారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోఅంశం పార్టీ ఓటమికి కారణమైనట్లు ఆయన అభిప్రాయపడ్డారు. పంజాబ్‌లోఅకాలీదళ్‌ పనితీరు చెడ్డగా లేకపోయినప్పటికీ ఆ పార్టీ ఓడిపోయిందని ఆయన అన్నారు.

మితిమీరిన విశ్వాసానికి బిజెపి మూల్యం చెల్లించాల్సి వచ్చిందని మూడు రోజుల పర్యటన కోసం నైనీటాల్‌ వచ్చిన ప్రధాని ఉత్తరాంచల్‌లో అన్నారు. తాను రాష్ట్ర పర్యటన చేసినప్పుడు ఫలితాలవిషయంలో మితిమీరిన విశ్వాసం ప్రదర్శించకూడదని చెప్పానని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X