ప్రతిపక్షాలకు తలవంచం: బిజెపి
న్యూఢిల్లీ: గుజరాత్ సంఘటనలపై వాయిదా తీర్మానానికి గానీ, ఓటింగ్కు అనుమతించే 184 నిబంధన కింద చర్చకు గానీ అంగీకరించకూడదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి ఉద్వాసన పలకకూడదనే పార్టీ జాతీయ కార్యవర్గ నిర్ణయాన్ని బలపరిచింది.ప్రధానిఅటల్ బిహారీ వాజ్పేయి అధ్యక్షతన మంగళవారంఉదయం దాదాపు గంట సేపు బిజెపి పార్లమెంటరీ పార్టీసమావేశమైంది. నరేంద్ర మోడిని తప్పించాల్సినఅవసరం లేదని పార్లమెంటరీ పార్టీ ఏకగ్రీవంగాఅభిప్రాయపడిందని పార్టీ అధికార ప్రతినిధి వి.కె.మల్హోత్రా విలేకరులకు చెప్పారు.
ప్రధాని
అటల్
బిహారీ
వాజ్పేయి
మతిస్థిమితం
కోల్పోయారని
ప్రతిపక్ష
నేత
సోనియా
గాంధీ
చేసిన
వ్యాఖ్యను,
వాజ్పేయిని
పొటా
కిందఅరెస్టు
చేయాలని
జమ్మూ
కాశ్మీర్
ప్రదేశ్
కాంగ్రెస్
కమిటీ
అధ్యక్షుడు
గులాం
నబీ
ఆజాద్
చేసిన
డిమాండ్ను
సమావేశం
తీవ్రంగా
ఖండించింది.