వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తమ జర్నలిస్టుకు రెండు లక్షలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదారాబాద్‌ః రాష్ట్ర స్థాయిలో ఏటా ఇచ్చే ఉత్తమ జర్నలిస్టు, ఉత్తమ ఫోటో గ్రాఫర్‌, ఉత్తమ గ్రామీణ విలేకరులకు ఇచ్చే నగదు బహుమతి మొత్తాన్ని భారీ ఎత్తున పెంచుతున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులకు కూడా అవార్డులను ఇవ్వనున్నట్టుగా ఆయన చెప్పారు.

కొత్తగా ఉత్తమ మహిళా జర్నలిస్టు అవార్డును, ఉత్తమ ఉర్దూ జర్నలిస్టు, ఉత్తమ కార్టూనిస్టు అవార్డులను కూడా ఇవ్వనున్నట్టుగా ఆయన వెల్లడించారు. మంగళవారం నాడు హైదరాబాద్‌లో జరిగిన ఒక వేడుకలో 1998,1999 సంవత్సరాలకు ఉత్తమ జర్నలిస్టు, ఉత్తమ గ్రామీణవిలేకరి, ఉత్తమ ఫోటోగ్రాఫర్‌ అవార్డులను ముఖ్యమంత్రిఅందజేశారు. ఉత్తమ జర్నలిస్టు, ఉత్తమ ఫోటోగ్రాఫర్‌కు ఉత్తమ ప్రధమ గ్రామీణవిలేకరికి ప్రస్తుతం ఇస్తున్న 25 వేల రూపాయల బహుమతి మొత్తాన్ని రెండు లక్షల రూపాయలకు ద్వితీయ ఉత్తమ గ్రామీణవిలేకరి అవార్డు బహుమతి మొత్తాన్ని పదిహేను వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు, తృతీయ ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు బహుమతిని పదివేల రూపాయల నుంచి యాభైవేల రూపాయకు హెచ్చిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. హెచ్చించిన నగదు ఇప్పటినుంచి అమల్లోకి వస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. మద్దూరి అన్నపూర్ణయ్యపేరుతో ఉత్తమ ఎడిటర్‌ అవార్డు ఎంపికకోసం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టుగా ఆయన వెల్లడించారు. పత్రికలను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. మీడియా వల్లనే అనేక సమస్యలు వెలుగులోకి వస్తున్నాయని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X