రెండో రోజూ పార్లమెంటు వాయిదా
న్యూఢిల్లీ:
గుజరాత్
ముఖ్యమంత్రి
నరేంద్ర
మోడి
విషయం
రెండో
రోజు
మంగళవారం
నాడు
కూడా
పార్లమెంటు
ఉభయ
సభలను
కుదిపేసింది.
గుజరాత్
ముఖ్యమంత్రి
నరేంద్ర
మోడికి
వెంటనే
ఉద్వాసన
చెప్పాలంటూ
ప్రతిపక్షాలతో
పాటు
కొన్ని
ఎన్డిఎ
మిత్రపక్షాలు
కూడా
డిమాండ్
చేస్తూ
ఉభయ
సభల
కార్యకలాపాలను
స్తంభింపజేశాయి.
ప్రతిపక్షాలు ఎంతకీ సద్దుమణగకపోవడంతో డిప్యూటీస్పీకర్ పి.ఎం. సయీద్ సభను వాయిదా వేశారు. జీరో అవర్లో వివిధఅంశాలు లేవనెత్తటానికి అవకాశం ఇస్తానని సయీద్ చెప్పినప్పటికీ సభ్యులువినిపించుకోలేదు.
రాజ్యసభలోనూ
అదే
పరిస్థితి
చోటు
చేసుకుంది.
కార్యకలాపాలేవీ
చేపట్టకుండానే
రాజ్యసభ
బుధవారంనాటికి
వాయిదా
పడింది.
గుజరాత్లోని
మత
హింసపై
చర్చకుఅనుమతించాలని,
ఆ
తర్వాత
ఓటింగ్
నిర్వహించాలని
రాష్ట్రీయ
జనతాదళ్
నాయకుడు
లల్లూ
ప్రసాద్
యాదవ్తో
పాటు
ప్రతిపక్ష
సభ్యులు
డిమాండ్
చేశారు.
తెలుగుదేశం
సభ్యులు
కూడా
ప్రతిపక్షాల
సభ్యులతో
గొంతు
కలిపారు.
మోడి
హటావో,
దేశ్
బచావోఅంటూ
కాంగ్రెస్
నాయకుడు
రాజు
పర్మార్తో
పాటు
ప్రతిపక్షాల
సభ్యులు
నినాదాలుచేశారు.
ప్రతిపక్షాలు
ఎంతకీ
వినకపోవడంతో
చైర్మన్
కృష్ణకాంత్
సభను
బుధవారంనాటికి
వాయిదా
వేశారు.