వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడి ఉద్వాసనకు పిసిసి దీక్షలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి ఉద్వాసనకు డిమాండ్‌ చేస్తూ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) ఆధ్వర్యంలో ఇక్కడ రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ఎఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం కాంగ్రెస్‌ నేతలు ఈ దీక్షలు చేపట్టారు.

పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణ రావుతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు చరఖాలు వడుకుతూ దీక్షలు చేశారు. ఎన్‌డిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నరేంద్ర మోడిని తప్పించాలని కూడా వారు నినాదాలు చేశారు.

నరేంద్ర మోడిన తప్పించాలని డిమాండ్‌ చేస్తూ తమ ఆందోళనను ఉధృతం చేయనున్నట్లుఎం. సత్యనారాయణరావు చెప్పారు. నరేంద్ర మోడిని గద్దె దించే వరకు ఆందోళన సాగుతుందని ఆయన చెప్పారు. గుజరాత్‌లో హింస ఆ రాష్ట్రానికే పరిమితం కాదని, ఇతర ప్రాంతాలకు కూడాపాకే ప్రమాదం ఉన్నదని ఆయన అన్నారు. దేశ సమగ్రత,సమైక్యతలకే కాకుండా సార్వభౌమాధికారానికి కూడా భంగం వాటిల్లుతోందని ఆయన అన్నారు. రాజీవ్‌ గాంధీ హత్యకుగురైన ఈ నెల 21వ తేదీ వరకు తమ రిలేనిరాహార దీక్షలు సాగుతాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X