వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశవ్యాప్తంగాసార్వత్రిక సమ్మె

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానానికి, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు మంగళవారం దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలపై, బ్యాంక్‌లపై, బొగ్గు గనులపై సమ్మె ప్రభావం పడింది.

సమ్మెకువిశేష ప్రతిస్పందన లభించిందని ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి గురుదాస్‌ దాస్‌గుప్తా అన్నారు. సమ్మెకు కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. అయితే కాంగ్రెస్‌ అనుబంద కార్మిక సంఘం ఐఎన్‌టియుసి సమ్మెకు దూరంగా వుంది. ఐఎన్‌టియుసి తప్ప అన్ని కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయని సిఐటియు కార్యదర్శి తపన్‌సేన్‌ చెప్పారు.

ట్రాన్స్‌పోర్టు రంగానికి చెందిన పది మిలియన్ల కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నట్లు దాస్‌గుప్తా చెప్పారు. తమ డిమాండ్ల సాధనకు ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X