వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మత హింసకు పరిష్కారం: అమెరికా

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: భారత ముస్లింలు, హిందువులు తమ విభేదాలకు శాంతియుత పరిష్కారం కనుక్కోవాలని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి ఫిలిప్‌ రీకర్‌ సూచించారు. గుజరాత్‌లో జరిగినటువంటి మత హింస ఎవరికీ ఉపయోగ పడదని రీకర్‌ అన్నారు.

అన్ని మతాలనుఅంగీకరిస్తూ విభిన్న జాతుల లౌకిక దేశంగా భారత్‌గర్వపడే పరిస్థితిని సాధించుకుందని ఆయన చెప్పారు. మత ఘర్షణలు అమాయకుల ప్రాణాలు బలిగొంటాయే తప్ప ఎవరికీ ఉపయోగపడవని ఆయన అన్నారు. ఇటీవలి భారత పర్యటన సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి క్రిస్టినా రొక్కా ఇదేవిషయాన్ని ఆ దేశ నేతలకు చెప్పినట్లు ఆయన తెలిపారు. గుజరాత్‌లోని హింసను తాము స్పష్టంగా ఖండిస్తున్నామని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X