వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్నెట్‌ స్కీంలో ఆంధ్రకు ఎ-1 హోదా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: స్కూల్‌ సెకండరీ సర్టిఫికెట్‌ ఎస్‌ఎస్‌సి పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఈ నెల 30వ తేదీన వెలువడుతాయి. పాఠశాలవిద్యా మంత్రి మండవ వేంకటేశ్వరరావు బుధవారంవిలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పారు.

రాష్ట్రంలో 9.80 లక్షల మందికిపైగా విద్యార్థులు ఎస్‌ఎస్‌సి పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల వెల్లడి అనంతరం పరీక్ష తప్పినవిద్యార్థుల కోసం మే 29, జూన్‌ 11 తేదీల మధ్య ఇన్‌స్టంట్‌ పరీక్షలు నిర్వహిస్తారని వేంకటేశ్వర రావు చెప్పారు. పరీక్ష తప్పినవిద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఈ ఇన్‌స్టంట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

డిఎస్‌సి 2002 పరీక్ష ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 31 వేలకుపైగా టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ఇందుకు గాను మే 5వ తేదీన నోటిఫికేషన్‌ జారీ అవుతుందని ఆయన అన్నారు. మే 20వ తేదీ వరకు దరఖాస్తులువిక్రయిస్తారు. పరీక్షలు మూడు విడతలుగా జూన్‌ 14, 15, 16 తేదీల్లో జరుగుతాయి. జులై 15వ తేదీ నుంచి పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ కాలంలోనే టీచర్ల బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X