వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపికి ఎన్‌సిపి మొండి చేయి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్‌ సంఘటనలపై లోక్‌సభలో 184 కింద చర్చలో తాము పాల్గొంటామని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేస్తామని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) ప్రకటించింది. తమకు ఎన్‌సిపి మద్దుతు ఇస్తుందనుకున్న బిజెపికి ఆశాభంగమేఅయింది.

గుజరాత్‌లోని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి తగినంతవిషమంగా వున్నాయని, కేంద్రం 355 లేదా 356 అధికరణ కింద జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తాము చెబుతూనే ఉన్నామని ఎన్‌సిపి నేత శరద్‌పవార్‌ ప్రకటించారు.

ఇదిలా వుంటే, బిజెపి ఎదురు దాడికి ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో గుజరాత్‌లో ఉన్నటువంటి పరిస్థితులే వున్నాయని బిజెపి అధికార ప్రతినిధివి.కె. మల్హోత్రా అన్నారు. బీహార్‌ సంఘటనలపై 184 నిబంధన కింద చర్చకు నోటీసు ఇస్తామని ఆయన చెప్పారు. పశ్చిమ బెంగాల్‌పై 184 కింద చర్చకు తృణమూల్‌ కాంగ్రెస్‌ నోటీసు ఇస్తే తాము సమర్థిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X