వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభిశంసనపై అన్నాడియంకె తటస్థం

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: గుజరాత్‌ హింసపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అభిశంసన తీర్మానంపై వోటింగ్‌లో పాల్గొనకూడదని అన్నాడియంకె నిర్ణయించుకుంది.

తీర్మానానికి వ్యతిరేకంగా గానీ, అనుకూలంగా గానీ తమ పార్టీ ఓటు చేయదని అన్నాడియంకె నేత, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారంవిలేకరులతో చెప్పారు.

ఈ వైఖరి బిజెపికి దగ్గర కావడాన్ని సూచిస్తోందా అని అడిగితే తాము బిజెపి, కాంగ్రెస్‌ కూటములకు రెండింటికీ సమాన దూరంలో వుంటామని ఆమె జవాబిచ్చారు. మాదిస్వతంత్ర పార్టీ. అన్ని అంశాలపై మేం స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాం అని ఆమె అన్నారు.

గుజరాత్‌లో ఇప్పటికీ హింసకు ఆగకపోవడం విచారకరమని, హింసను ఆపేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి ఉద్వాసన పలకడానికి బిజెపి నిరాకరించడంపై వ్యాఖ్యానించడానికి ఆమె
ఇష్టపడలేదు. ఇది మరో పార్టీ అంతర్గత వ్యవహారమని ఆమె అన్నారు.

నేను మరో ముఖ్యమంత్రి రాజీనామా కోసం డిమాండ్‌ చేయను. ఆ విధమైన డిమాండ్‌ పెట్టడం తప్పు కూడా. కానీ మోడిస్వచ్ఛందంగా రాజీనామా చేస్తే అది వేరే విషయం అని జయలలిత అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X