వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల ధ్వజం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ పద్ధతిపై ప్రతిపక్షాలు శుక్రవారం లోక్‌సభలో తీవ్రంగా ధ్వజమెత్తాయి. కేంద్రబడ్జెట్‌లో కొన్ని రాయితీలను శుక్రవారం నాడు ప్రకటించినప్పటికీ ప్రజలువిసిగిపోయి వున్నారని, దాంతో బిజెపి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం దుమ్ము కొట్టుకుపోయే పరిస్థితిలో ఉన్నదని ప్రతిపక్షాలువిమర్శించాయి.

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంపై ప్రజలువిసిగిపోయి వున్నారనడానికి ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాల సభ్యులు అన్నారు. బిజెపి నేతృత్వంలోని సంకీర్ణాన్ని అధికారంలోకి తెచ్చినందుకు ప్రజలు తప్పు చేశామని భావిస్తున్నారని చర్చను ప్రారంభిస్తూ పవన్‌ కుమార్‌ బన్సాల్‌(కాంగ్రెస్‌) అన్నారు.

పాలక పక్షం నుంచి కూడా ఒత్తిడి రావడం వల్లనే యశ్వంత్‌ సిన్హా కొన్ని రాయితీలు ప్రకటించారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక మాంద్యాన్ని తగ్గించడంలో ఒక వ్యూహంతో ముందుకు రావడంలో ప్రభుత్వంవిఫలమైందని ఆయన తప్పు పట్టారు. బిజెపి సంకీర్ణంస్వదేశీ నినాదాన్ని ఒక సిద్ధాంతంగా వాడలేదని, ఒక ఆటవస్తువుగా మాత్రమే వాడిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X