వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశీ పెట్టుబడులకు ఆటంకం: సోనియా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్‌లోని హింస విదేశీ పెట్టుబడులకు అవరోధమవుతుందని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. అంతర్జాతీయంగా దేశ పరపతినిదెబ్బ తీస్తాయని, భారత పారిశ్రామిక రంగంపై కూడావీటి ప్రభావం వుంటుందని ఆమె అన్నారు. భారత పారిశ్రామిక సమాఖ్య(సిఐఐ) వార్షిక సమావేశాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు.

గుజరాత్‌లోపెరిగిన ప్రయివేట్‌ ఎంటర్‌ ప్రయిజెస్‌ పెరుగుదలను, పౌర స్ఫూర్తిని అల్లర్లుదెబ్బ తీశాయని ఆమె అన్నారు. గుజరాత్‌ ఆర్థికంగా ముందుకు సాగుతున్న తరుణంలో విధ్వంసకాండ జరగడంవిచారకరమని ఆమె అన్నారు. సామాజిక అనుబంధం, సామరస్యాల వల్ల మాత్రమే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని ఆమె అన్నారు. దేశ లౌకిక పునాదులను ఒక పద్ధతి ప్రకారం నాశనం చేస్తున్నారని సోనియావిమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X