వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుతోచౌతాలా భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గుజరాత్‌ వ్యవహారంపై ప్రతిపక్షాల ప్రతిపాదించిన అభిశంసన తీర్మానంపై మంగళవారం మాత్రమే తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మంగళవారం పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశమై ఈవిషయంలో నిర్ణయం తీసుకుంటుంది.

గుజరాత్‌ వ్యవహారంపై ప్రతిపాదించిన అభిశంసన తీర్మానంపై అనుసరించాల్సిన వైఖరి గురించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం పార్టీ ముఖ్యులతో చర్చించారు. హోం మంత్రి టి. దేవేందర్‌ గౌడ్‌, భారీ పరిశ్రమల మంత్రి కోటగిరి విద్యాధర రావు, పోలిట్‌బ్యూరో సభ్యుడు రావూరి ప్రకాశ్‌రెడ్డితో ఆయన చర్చలు జరిపారు.

ఇదిలావుంటే, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతకె. ఎర్రంనాయుడు, ఉప నాయకుడు ఎస్‌. వేణుగోపాలచారి సోమవారం ఉదయం చంద్రబాబునాయుడును కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ నేత చంద్రబాబు ఆ నిర్ణయాన్ని తమకు తెలియజేస్తారని, ఆ మేరకు తాము లోక్‌సభలో నడుచుకుంటామని ఎర్రంనాయుడు తనను కలిసినవిలేకరులతో చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X