వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపిలో భారీ సంస్థాగత మార్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇటీవలి ఎన్నికల పరాజయం నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) భారీ సంస్థాగత మార్పులు చేపట్టింది. పార్టీ ఉపాధ్యక్షుడుకైలాస్‌పతి మిశ్రాను నాలుగు రాష్ట్రాల బాధ్యతల నుంచి తప్పించారు.మిశ్రా ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్‌, బీహార్‌,ఒరిస్సా, జార్ఖండ్‌ రాష్ట్రాల పార్టీ బాధ్యతలు చూస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌నుసీనియర్‌ పార్టీ నేత దేవదాస్‌ ఆప్టేకు, బీహార్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి మాయాసింగ్‌కు, ఒరిస్సాను సంజయ్‌ పాశ్వాన్‌కు, జార్ఖండ్‌ను కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రధాన్‌కుఅప్పగించారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్టీ ఉపాధ్యక్షుడు వి. రామారావు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల ఇన్‌ఛార్జీగా వ్యవహరిస్తారు. ఈశాన్య రాష్ట్రాల ఇన్‌ఛార్జీ పార్టీ కార్యదర్శి పద్మనాభాచార్య కేరళ, లక్షద్వీప్‌ల బాధ్యతలు నిర్వహిస్తారు.

బిజెపి మాజీ ఎంపి ఓం ప్రకాశ్‌ కోహ్లీని నాలుగు రాష్ట్రాల బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన ఆరు రాష్ట్రాల పార్టీ వ్యవహారాలు చూసేవారు. ఇప్పుడు ఆయన హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ కాశ్మీర్‌ వ్యవహారాలు మాత్రమే చూస్తారు. ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల బాధ్యతలను ఆయన నుంచి తప్పించారు.

మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగనున్న గోవా బాధ్యతలతో పాటు మహారాష్ట్రబాధ్యతలను బాల్‌ ఆప్టే చూస్తారు. ఈశాన్య రాష్ట్రాల బాధ్యతలను వి. సతీష్‌ పద్మనాభాచార్య నుంచి తీసుకుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X