బిజెపిలో భారీ సంస్థాగత మార్పులు
న్యూఢిల్లీ:
ఇటీవలి
ఎన్నికల
పరాజయం
నేపథ్యంలో
భారతీయ
జనతా
పార్టీ
(బిజెపి)
భారీ
సంస్థాగత
మార్పులు
చేపట్టింది.
పార్టీ
ఉపాధ్యక్షుడుకైలాస్పతి
మిశ్రాను
నాలుగు
రాష్ట్రాల
బాధ్యతల
నుంచి
తప్పించారు.మిశ్రా
ఇప్పటి
వరకు
పశ్చిమ
బెంగాల్,
బీహార్,ఒరిస్సా,
జార్ఖండ్
రాష్ట్రాల
పార్టీ
బాధ్యతలు
చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్టీ ఉపాధ్యక్షుడు వి. రామారావు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ఇన్ఛార్జీగా వ్యవహరిస్తారు. ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జీ పార్టీ కార్యదర్శి పద్మనాభాచార్య కేరళ, లక్షద్వీప్ల బాధ్యతలు నిర్వహిస్తారు.
బిజెపి మాజీ ఎంపి ఓం ప్రకాశ్ కోహ్లీని నాలుగు రాష్ట్రాల బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన ఆరు రాష్ట్రాల పార్టీ వ్యవహారాలు చూసేవారు. ఇప్పుడు ఆయన హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వ్యవహారాలు మాత్రమే చూస్తారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల బాధ్యతలను ఆయన నుంచి తప్పించారు.
మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగనున్న గోవా బాధ్యతలతో పాటు మహారాష్ట్రబాధ్యతలను బాల్ ఆప్టే చూస్తారు. ఈశాన్య రాష్ట్రాల బాధ్యతలను వి. సతీష్ పద్మనాభాచార్య నుంచి తీసుకుంటారు.