ఆర్మీ డాక్టర్ కిడ్నాప్మిస్టరీ
వరంగల్:
వరంగల్
జిల్లాలో
ఒక
ఆర్మీ
డాక్టర్
కిడ్నాప్మిస్టరీగా
మారింది.
ఆయనను
సోమవారం
నాడు
గుర్తు
తెలియని
వ్యక్తులు
వరంగల్
జిల్లా
పాలకుర్తి
మండలం
మంచుప్పుల
గ్రామం
నుంచి
కిడ్నాప్
చేశారు.
ఇప్పటి
వరకు
ఆయనను
ఎవరు
కిడ్నాప్
చేసింది
తెలియడం
లేదు.
హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్న రామచంద్రరావు తన సోదరుడు రామ్మోహన్ రావుతో కలిసి తన సొంత గ్రామమైన మంచుప్పలకు తరుచు వెళ్తుంటాడు. ఎప్పటి లాగే ఈసారి కూడా వెళ్లాడు. సోమవారం గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి పునరుద్ధరణ వ్యవహారాలను చూస్తుండగా కొంత మంది సాయుధులు వచ్చి రామచంద్రరావును, ఆయన సోదరుడు రామ్మోహన్రావును, వారి వద్ద పని చేస్తున్న నర్సయ్యనుఅపహరించుకుపోయారు.
ఆ తర్వాత వారు రామ్మోహన్ రావును విడుదల చేశారు. ఆయన గ్రామానికి చేరుకుని తన కుటుంబ సభ్యులను తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఆయన కిడ్నాప్విషయమై నోరు విప్పడం లేదు. పోలీసులు అడిగినా ఆయన ఏమీ చెప్పడం లేదు.