ఖాట్మండు: నేపాల్లోని రెండు పశ్చిమ జిల్లాల్లో భద్రతాధికారులతో జరిగిన ఘర్షణల్లో135 మంది మావోయిస్టు తిరుగుబాటుదార్లు మరణించినట్లు నేపాల్ హోం శాఖ సహాయ మంత్రి దేవేంద్ర రాజ్ కండేల్ శుక్రవారంనాడు చెప్పారు.
ఖాట్మండుకు పశ్చిమాన 398 కిలోమీటర్ల దూరంలో గల దోతి జిల్లా బాక్టాంగ్లో జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు 25 మంది మావోయిస్టు తీవ్రవాదులు మరణించారు. ఖాట్మండుకు పశ్చిమాన 298 కిలోమీటర్ల దూరంలో గల రోల్పా జిల్లా లిస్నా ప్రాంతంలో జరిగినమరో ఎన్కౌంటర్లో 110 మంది మావోయిస్టుతీవ్రవాదులు చనిపోయారు.