వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్‌కు భారత్‌ దన్ను

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ఎన్నికల సమయంలోఫ్లెక్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి లబ్దిపొందారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్‌ సిన్హా తనకే పాపం తెలియదంటున్నారు. యశ్వంత్‌ రాజీనామా కోరుతూ ప్రతిపక్షాలు నాలుగురోజులుగావిమర్శలు గుప్పిస్తున్నప్పటికీ ఆయన మౌనంగా వున్నారు. అయితే మంగళవారం ఆయన నోరువిప్పారు. యశ్వంత్‌ సిన్హా ఏమీ తప్పు చేయలేదని కరాఖండిగా చెప్పారని బిజెపి అధికార ప్రతినిధి మల్హోత్రా మంగళవారం బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వెల్లడించారు. ఆయన అంత మౌనంగా వుండాల్సిన అవసరం లేదని బిజెపి పార్లమెంటరీ పార్టీ అభిప్రాయపడిందని తెలిసింది. తనపై వచ్చిన ఆరోపణలపై సిన్హా బుధవారం పార్లమెంట్‌ లో ఒక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.

1999 లోక్‌ సభ ఎన్నికల సమయంలో యశ్వంత్‌ సిన్హాకు అవసరమైన ప్రచార సామగ్రినిఫ్లెక్స్‌ ఇండస్ట్రీస్‌ అందజేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్‌ ఆయన రాజీనామా కోరుతున్నవిషయం విదితమే. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు నోరుమెదపని యశ్వంత్‌ సిన్హా సోమవారం నాడు అద్వానీని కలుసుకొని మనసువిప్పి మాట్లాడారని అంటున్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని సిన్హా అద్వానీతో అన్నారని భావిస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X