వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేపాల్కు భారత్ దన్ను
న్యూఢిల్లీః ఎన్నికల సమయంలోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ నుంచి లబ్దిపొందారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా తనకే పాపం తెలియదంటున్నారు. యశ్వంత్ రాజీనామా కోరుతూ ప్రతిపక్షాలు నాలుగురోజులుగావిమర్శలు గుప్పిస్తున్నప్పటికీ ఆయన మౌనంగా వున్నారు. అయితే మంగళవారం ఆయన నోరువిప్పారు. యశ్వంత్ సిన్హా ఏమీ తప్పు చేయలేదని కరాఖండిగా చెప్పారని బిజెపి అధికార ప్రతినిధి మల్హోత్రా మంగళవారం బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వెల్లడించారు. ఆయన అంత మౌనంగా వుండాల్సిన అవసరం లేదని బిజెపి పార్లమెంటరీ పార్టీ అభిప్రాయపడిందని తెలిసింది. తనపై వచ్చిన ఆరోపణలపై సిన్హా బుధవారం పార్లమెంట్ లో ఒక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.
Comments
Story first published: Tuesday, May 14, 2002, 23:53 [IST]