వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌ కల్లోలం ఎన్డీఏ పుణ్యంః కాంగ్రెస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోనిపేదలకు పది లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ పట్టాలను వచ్చే రెండేళ్లలో పంపిణీ చేస్తామని ఆయన శుక్రవారం కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు.

జూన్‌ 1వ తేదీ నుంచి జరిగే జన్మభూమిలో లబ్ధిదార్ల జాబితాను రూపొందించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమావేశంలో విస్తృత చర్చ జరిపారు. కొన్ని శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తూనే ఆదాయ వనరులనుపెంచుకునే మార్గాలను అన్వేషించాలని ఆయన కలెక్టర్లకు సూచించారు.

రాష్ట్రంలో లా కమిషన్‌ను ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నదని ఆయన చెప్పారు. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి న్యాయ శాస్త్రంలో మార్పులు చేస్తామని ఆయన చెప్పారు. మండలాల వారీగా సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షిస్తూ కార్యచరణ ప్రణాళికలను రూపొందించుకోవాలని ఆయన సూచించారు. ప్రజా పనులను సమర్థంగా చేపట్టే ప్రాంతాలకు నిధులు అదనంగా ఇస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X