వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌తో యుద్ధమే మార్గం: విహెచ్‌పి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాశ్మీర్‌ సమస్య పరిష్కారానికి యుద్ధం ఒక్కటే మార్గమనివిశ్వ హిందూ పరిషత్‌ (విహెచ్‌పి) అభిప్రాయపడింది. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై చర్యకు దిగడం లేదనివిమర్శించింది.

ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ఈ నెల 23వ తేదీన శ్రీనగర్‌లో చేసిన ప్రకటన కాశ్మీర్‌ సమస్య పరిష్కారానికి మార్గం చూపబోదని విహెచ్‌పిసీనియర్‌ ఉపాధ్యక్షుడు ఆచార్య గిరిరాజ్‌ కిశోర్‌ అన్నారు. పాకిస్థాన్‌ను నమ్మడానికివీలు లేదని, అంతర్జాతీయ ఒత్తిడి తగ్గితే ఉగ్రవాదాన్ని మళ్లీప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు.

విహెచ్‌పి మాత్రమే కాదు, యావత్‌ దేశం తుది సమరాన్ని కోరుకుంటుందని ఆయన అన్నారు. పాకిస్థాన్‌కు తగిన విధంగా బుద్ధి చెప్పనంత వరకు కాశ్మీర్‌ సమస్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. లడక్‌ను బీజింగ్‌కు ఇచ్చి, తాను కాశ్మీర్‌ను తీసుకోవడానికి ఇస్లామాబాద్‌ ఒక రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకుందని ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్‌లోస్వేచ్ఛగా, నిజాయితీగా ఎన్నికలు జరగవని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X