వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిష్కారానికి అడ్డంకులు తాత్కాలికమే

By Staff
|
Google Oneindia TeluguNews

మైసూరు: రాజకీయ శక్తుల జోక్యం వల్లనే అయోధ్యలోని మందిర్‌- మసీదువివాదానికి పరిష్కారాన్ని కనుక్కునేందుకు చేస్తున్న కృషిలో అంతరాయం ఏర్పడిందని కంచి కామకోటిపీఠం జయేంద్ర సరస్వతి స్వామీజి అన్నారు.

వివాదంలో మధ్యవర్తిత్వం ఫలితం చూపిందని, స్థానిక ముస్లింలు సంతృప్తి వ్యక్తం చేశారని, అయితే తృతీయ శక్తి జోక్యం వల్లవివాద పరిష్కారానికి తాత్కాలికంగా అంతరాయం ఏర్పడిందని ఆయన శనివారం రాత్రివిలేకరులతో అన్నారు.

తాను మధ్యవర్తిత్వం నెరుపుతున్న సమయంలో రెండు వేల మంది ముస్లింలు స్థానిక మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారని, బాబ్రీ మసీదు అవసరం అంతగా లేదని వారు అభిప్రాయపడ్డారని, కానీ బయటవారు దీన్ని సమస్యగా చేస్తున్నారని ఆయన అన్నారు.

అయోధ్యంలో ఎన్నో దేవాలయాలు వుండగా మరో దేవాలయం అవసరమా అని అడిగితే రామాలయం రాముని జన్మస్థలంలో నిర్మించాలని,వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, నమాజు చేయడం లేదని, అక్కడ ఆలయం నిర్మించవచ్చునని,వివాదం అనవసరంగా రాజకీయ దిశ తీసుకుందని ఆయన సమాధానమిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X