వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు దమ్ము లేదు: ఫరూఖ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

జమ్మూ: పాకిస్థాన్‌ లోపలి మిలిటెంట్‌ శిక్షణా శిబిరాలపై దాడి చేసే దమ్ము భారత్‌కు లేదని జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా ఆదివారంనాడు అన్నారు. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్‌ చేతలుడిగినట్లు వ్యవహరించడం వల్ల భారత్‌ బలహీన దేశమనే సందేశం వెళ్లిందని ఆయన అన్నారు. జమ్మూ విశ్వవిద్యాలయంలో జాతీయ భద్రతపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు.

భారత్‌ ఎప్పుడు చర్య తీసుకుంటుందా అని తాను వేచిస్తున్నానని, ఎంత కాలం మన ప్రజలు మరణిస్తూ పోతారని ఆయన అన్నారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని గెరిల్లా శిక్షణా శిబిరాలపై భారత్‌సైనిక దాడులు నిర్వహించాలని ఆయన పలుమార్లు డిమాండ్‌ చేశారు. అమెరికా తన ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటుందని, భారత్‌ పటిష్టంగా వుండడం ఏ దేశమూకోరుకోవడం లేదని, అందు వల్ల భారత నాయకత్వం ఎవరినీవిశ్వసించకూడదని ఆయన
అన్నారు.

చైనా పాకిస్థాన్‌ అణు, క్షిపణి కార్యక్రమాలను సమర్థించడాన్ని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. పాకిస్థాన్‌కు అణ్వాయుధాలు, క్షిపణులు ఎక్కడి నుంచి వచ్చాయోఅందరికీ తెలుసునని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X