వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆనాడే తిప్పికొట్టాల్సింది: వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

మనాలి: పార్లమెంటుపై డిసెంబర్‌ 13వ తేదీన దాడి జరిగిన వెంటనే ఇస్లామిక్‌మిలిటెంట్లను తిప్పి కొట్టాల్సి వుండిందని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. పార్లమెంటుపై దాడికి వెంటనే భారత్‌ జవాబు చెప్పి వుండాల్సిందని ఆయన అన్నారు. రోహటంగ్‌ పాస్‌లో కొత్త రోడ్డు టన్నెల్‌ను ఆయన ఆదివారంనాడు ప్రారంభించారు.

సంయమనం పాటించాలని ప్రతి ఒక్కరూ సూచించారని, ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగబోవని హామీ ఇచ్చారని, అయితే ఆ తర్వాత కూడా అటువంటి సంఘటనలు జరిగాయని ఆయన అన్నారు. పాకిస్థాన్‌విషయంలో భారత్‌ ఓపిక నశించిందని, ఉగ్రవాదంపై పోరులోవిజయానికి జాతి సమైక్యంగా సమాయత్తం కావాలని ఆయన అన్నారు. సవాల్‌ను ఎదుర్కోవడానికి భుజం భుజం కలిపి ముందుకు సాగాలని, మనం ఉగ్రవాదంపైవిజయాన్ని కోరుకుంటున్నామని ఆయన అన్నారు.

పాకిస్థాన్‌ కొత్త పద్ధతిలో యుద్ధం చేస్తోందని, ప్రత్యక్ష యుద్ధంలో పాకిస్థాన్‌ ఎప్పుడూ ఓటమినే చవి చూసిందని,అందువల్ల ఉగ్రవాదం ద్వారా యుద్ధం చేసే కొత్త పద్ధతిని ఎంచుకుందని ఆయన అన్నారు. చెప్పినదాన్ని పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌ అమలు చేయాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X