వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్‌ మహానాడుకు ఏర్పాట్లు పూర్తి

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఇక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే మహానాడు సోమవారం ఇక్కడ ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం వరంగల్‌కు చేరుకుంటారు.

మహానాడులో 41అంశాలపై చర్చలు జరుగుతాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి ఆదివారంవిలేకరుల సమావేశంలో చెప్పారు. మొదటి రెండు రోజులు చర్చలు జరుగుతాయని, మూడో రోజు తీర్మానాలను ఆమోదిస్తామని, ఈ తీర్మానాలను కాకతీయ డిక్లరేషన్‌గా విడుదల చేస్తామని ఆయనవివరించారు. కాకతీయ డిక్లరేషన్‌పై కార్యాచరణను రూపొందించుకుని ప్రభుత్వానికి మార్గదర్శకత్వం చూపుతామని ఆయన చెప్పారు.

వరంగల్‌లో మహానాడును జరపడమే వెనుకబడిన తెలంగాణను గుర్తించడమని ఆయన అన్నారు. వరంగల్‌ జిల్లాకు సంబంధించి నాలుగుఅంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. సాగునీటి వనరులకు, టూరిజం ప్యాకేజీకి, ఆజం జాహీమిల్లు పునరుద్ధరణకు, ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటుకు సంబంధించి మహానడులో నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి సూచనలు చేస్తామని ఆయన చెప్పారు.

ఈ మహానాడులో ఆరు వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు.వీరందరికీ అన్ని వసతులు కల్పించారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ లేవని నిర్వాహకులు చెప్పారు. ఫోటో ఎగ్జిబిషన్‌ కూడా ఏర్పాటు చేస్తున్నారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల ముంగిట పాలన వంటి కార్యక్రమాలకు ఎగ్జిబిషన్‌లో ప్రాధాన్యం ఇస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X