వరంగల్ మహానాడుకు ఏర్పాట్లు పూర్తి
వరంగల్:
తెలుగుదేశం
పార్టీ
మహానాడుకు
ఇక్కడ
ఏర్పాట్లు
పూర్తయ్యాయి.
మూడు
రోజుల
పాటు
జరిగే
మహానాడు
సోమవారం
ఇక్కడ
ప్రారంభమవుతుంది.
ముఖ్యమంత్రి,
తెలుగుదేశం
పార్టీ
అధ్యక్షుడు
నారా
చంద్రబాబునాయుడు
సోమవారం
ఉదయం
వరంగల్కు
చేరుకుంటారు.
వరంగల్లో మహానాడును జరపడమే వెనుకబడిన తెలంగాణను గుర్తించడమని ఆయన అన్నారు. వరంగల్ జిల్లాకు సంబంధించి నాలుగుఅంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. సాగునీటి వనరులకు, టూరిజం ప్యాకేజీకి, ఆజం జాహీమిల్లు పునరుద్ధరణకు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించి మహానడులో నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి సూచనలు చేస్తామని ఆయన చెప్పారు.
ఈ మహానాడులో ఆరు వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు.వీరందరికీ అన్ని వసతులు కల్పించారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ లేవని నిర్వాహకులు చెప్పారు. ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల ముంగిట పాలన వంటి కార్యక్రమాలకు ఎగ్జిబిషన్లో ప్రాధాన్యం ఇస్తారు.