వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోద్రాలో పేలుడు, మళ్లీ కర్ఫ్యూ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:జూన్‌ 1వ తేదీ నుంచి జరిగే 17వ విడత జన్మభూమి పనులకు 316 కోట్ల రూపాయలు విడుదల చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రి వర్గ సమావేశం రైతు, మహిళ జన్మభూమి ఏర్పాట్లను సమీక్షించింది. ఈ సమావేశంవివరాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రి ఎస్‌. చంద్రమోహన్‌ రెడ్డివిలేకరుల సమావేశంలో వెల్లడించారు.

సహకార రుణాలపై వడ్డీ రాయితీ కోసం 30 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కూడా మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు ప్రోత్సహకాల కింద 120 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు చంద్రమోహన్‌ రెడ్డి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాకు 40 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కూడా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

జన్మభూమి కార్యక్రమం సందర్భంగా రెండు లక్షల మందికి అదనంగా వృద్ధాప్య పింఛన్లు ఇవ్వనున్నట్లు, దీపం పథకం కింద మరో రెండు లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. జన్మభూమిపై కాంగ్రెస్‌విమర్శలు సహేతకంగా లేవని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ అడిగినవివరాలను అన్నింటినీ తాము పంపించామని, అయినప్పటికీ కాంగ్రెస్‌ జన్మభూమిపైవిమర్శలు చేస్తూనే ఉన్నదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X