హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న ఇ- సేవలను ప్రపంచబ్యాంక్ ప్రతినిధి బృందం ప్రశంసించింది. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు రాష్ట్రంలోని ఇ- సేవా కేంద్రాలను బుధవారం పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కొత్త ఒరవడినిపెట్టిందని వారు కొనియాడారు. ఐటి ద్వారా పౌరులకు ఏ విధమైనసేవలు అందివచ్చునో, ప్రయివేట్ భాగస్వామ్యంతో వాటిని ఎంత సమర్థంగా నిర్వహించవచ్చునో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరూపించిందని వారన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఇ-సేవలను ఇతర దేశాలకు ఉదాహరణగా చూపవచ్చునని వారు అభిప్రాయపడ్డారు.