వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బేషరతుగా చర్చలు: ముషార్రఫ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఆల్మాటీ: కాశ్మీర్‌సంక్షోభంపై తాను భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయితో బేషరతుగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌ అన్నారు. కజక్‌లోని ఆల్మాటీలో భద్రతపై ఏర్పాటయిన ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికిఆయన ఇక్కడికి వచ్చారు.

నాకేమీ షరతులు లేవు. ఈ ప్రశ్నమీరు వాజ్‌పేయిని అడగండి అని ఆయన కజక్‌స్థాన్‌ అధ్యక్షుడు నూరుసుల్తాన్‌ నాజర్‌బయేవ్‌తో సమావేశమైన అనంతరంవిలేకరుల సమావేశంలో అన్నారు. యుద్ధ నివారణ చర్యల గురించి అడిగినప్పుడు- యుద్ధ నివారణకు తన ప్రయత్నం తాను చేస్తానని, తానువిజయం సాధిస్తాననే నమ్మకం ఉన్నదని, ఒక చేతితో చప్పుడు కాదు, రెండు చేతులు కలిస్తేనే చప్పుడవుతుందని వారంటున్నారని, యుద్ధ నివారణకు అవతలి పక్క కూడా అంతే ప్రయత్నం చేయాలని, తద్వారా మాత్రమే యుద్ధాన్ని నివారించగలమని ఆయన అన్నారు.

చర్చలకు వాజ్‌పేయి నుంచి హామీని పొందపోలేకపోయినట్లు నాజర్‌బయేవ్‌ తనకు చెప్పినట్లు ముషార్రఫ్‌ తెలిపారు. రష్యా అధ్యక్షుడువ్లదిమీర్‌ పుతిన్‌ మధ్యవర్తిత్వ అవకాశాలపై ప్రశ్నించినప్పుడు- భారత్‌ పాకిస్థాన్‌ల మధ్య మధ్యవర్తిత్వానికి పుతిన్‌ కచ్చితంగా పాత్ర పోషించగలిగే స్థితిలో ఉన్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X