వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముషారఫ్‌, వాజ్‌పేయి భేటీ?

By Staff
|
Google Oneindia TeluguNews

ఆల్మాటి: జమ్మూ కాశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదానికిస్వస్తి చెప్పే వరకు పాకిస్థాన్‌తో చర్చలు జరపాలనే ఇతర దేశాల ప్రయత్నాలకు తలొగ్గబోమని భారత్‌ సోమవారం స్పష్టం చేసింది. ఆల్మాటీలో కజక్‌స్థాన్‌కు పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌, భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి చేరుకున్న నేపథ్యంలో భారత్‌ ఈ ప్రకటన చేసింది.

పక్క పక్క హోటల్లలోనే వుంటున్న ముషార్రఫ్‌కు, వాజ్‌పేయికి మధ్య చర్చలకు ఏర్పాట్లు చేస్తానని కజక్‌స్థాన్‌ అధ్యక్షుడు నూరుసుల్తాన్‌ నజర్‌బయేవ్‌ చేసిన ప్రతిపాదనను భారత్‌ సున్నితంగా తిరస్కరించింది.

ఇతర దేశాలు ఏమనుకుంటున్నాయనే విషయంతో తమకు సంబంధం లేదని, సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్‌స్వస్తి చెప్పేంత వరకు ఆ దేశంతో చర్చలు జరపబోమని భారత విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఒమర్‌ అబ్దుల్లావిలేకరులతో చెప్పారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వాజ్‌పేయితో పాటు ఆయన ఇక్కడికి వచ్చారు. జమ్మూ కాశ్మీర్‌లో హింస తగ్గి, చొరబాట్లు నిలిచిపోయే వరకు వాజ్‌పేయి ముషార్రఫ్‌తో చర్చలు జరపబోరని, ఈవిషయంలో తమ వైఖరిని ఏ మాత్రం మార్చుకోలేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X