వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాదరహిత అభ్యర్థి ఎంపికకు సూచన: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం:వివాదరహితుడైన అభ్యర్థిని రాష్ట్రపతి పదవికి ఎంపికచేయాలని మాత్రమే తాను ప్రధాన అటల్‌బిహారీ వాజ్‌పేయికి సూచించినట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన శనివారం ఉదయం ఇక్కడికి వచ్చినప్పుడువిశాఖపట్నం విమానాశ్రయంలో కొద్ది సేపు విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రపతి పదవి అభ్యర్థిపై జరుగుతున్న చర్చలపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు. అవసరమైతే మరోమారు ప్రధానిని కలుసుకుంటానని ఆయన చెప్పారు. గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుపై ఆశలు వదులుకోవడమే మంచిదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు పది వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, దీనికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా కర్ణాటక అభ్యంతరం చెప్పవచ్చునని ఆయన అన్నారు. గంగవరం పోర్టుకు త్వరలో టెండర్లను పిలుస్తామని ఆయన చెప్పారు.

అనంతరం ఆయన విశాఖపట్నం మురికివాడల్లో ఆకస్మిక పర్యటన జరిపారు.విశాఖపట్నాన్ని దేశంలోనే సుందర నగరంగా తీర్చి దిద్దుతామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. మురికివాడల్లోని ప్రజలకు గృహాల నిర్మాణానికి ఒక ప్రణాళికను రూపొందిస్తామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X