వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ ఎడ్లబండ్ల ర్యాలీ

By Staff
|
Google Oneindia TeluguNews

జమ్మూ: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో శుక్రవారం రాత్రి పూంఛ్‌ జిల్లాలో ఇద్దరు పౌరులు మరణించారు. ఒక మహిళతో పాటు ముగ్గురు గాయపడ్డారు.

బాల్నోయి ప్రాంతంలో ఇద్దరు పౌరులు మరణించినట్లు, మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు చెప్పారు. మండి ప్రాంతంలో ఒక మహిళస్వల్పంగా గాయపడినట్లు, ఆమె ఇల్లు ధ్వంసమైనట్లు వారు చెప్పారు.

పాకిస్థాన్‌ బలగాలు సాజైన్‌, గజ్రైన్‌, పూంఛ్‌లను లక్ష్యంగా ఎంచుకుని శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి నాలుగు గంటల పాటు మోర్టార్లను ప్రయోగించాయి;మిషన్‌ గన్‌లతో కాల్పులు జరిపాయి. అయితే ఈ కాల్పుల్లో ప్రాణ, ఆస్తి నష్టాలేవీ సంభవించలేదు. పాకిస్థాన్‌ బలగాలను భారత బలగాలు తిప్పికొట్టాయి.

కతువా జిల్లా నుంచి అందిన సమాచారం మేరకు హీరానగర్‌సెక్టార్లతో ఇరు దేశాల బలగాల మధ్య తరుచుగా ఎదురు కాల్పులు జరిగాయి. రాజౌరీ జిల్లా నౌషేరాసెక్టార్‌లో కూడా భారీగా కాల్పులు జరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X