వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిఘా విమానాలు మామూలేః భారత్
విశాఖపట్నంః జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారంవిశాఖపట్నం జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చోడవరం మండలంలో జరిగిన జన్మభూమి సభలో చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిప్పులు చెరిగే ఎండలో గ్రామసభకుహాజరైన ప్రజల కోసం షామియానాలు కానీ కనీసం మంచి నీళ్ళు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో పలువురు వృద్ధులు ఎండ వేడికి సొమ్మసిల్లి పోయారు. ఒక వైపు చంద్రబాబు ప్రసంగిస్తుండగానే సుమారు పది మంది ఎండదెబ్బకు సొమ్మసిల్లి పోయారు. దీంతో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు.
Story first published: Saturday, June 8, 2002, 23:53 [IST]