వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగుళూర్‌కు ఎన్‌సిపి ఎమ్మెల్యేలు

By Staff
|
Google Oneindia TeluguNews

ఇండోర్‌: అధికార డెమొక్రటిక్‌ ఫ్రంట్‌లో ప్రధాన భాగస్వామిఅయిన నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) మంత్రులు, శాసనసభ్యులు శనివారం ఇండోర్‌ నుంచి బెంగుళూర్‌కు తరలిపోయారు. మరిన్ని ఫిరాయింపులను నిరోధించడానికివీరిని బెంగుళూర్‌కు తరలించినట్లు సమాచారం.

తాము ఎక్కడికి వెళ్తున్నదీ చెప్పడానికివీల్లేదని మహారాష్ట్ర ఆబ్కారీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ అన్నారు. డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన నేపథ్యంలో ఎన్‌సిపి నుంచి బిజెపి- శివసేన కూటమిలోకి ఫిరాయింపులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత తరుణంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కావచ్చుననే ఆందోళనతో తాము ఇండోర్‌ నుంచి వెళ్లిపోతున్నట్లు దేశ్‌ముఖ్‌ చెప్పారు. కాంగ్రెస్‌, ఎన్‌సిపి శాసనసభ్యులుఒకే చోట ఉండాలనేది తమ ఉద్దేశ్యమని, అందుకే తమ శాసనసభ్యులను బెంగుళూర్‌కు పంపిస్తున్నామని ఎన్‌సిపి అధికార ప్రతినిధి ప్రఫుల్‌ పటేల్‌ చెప్పారు. కాంగ్రెస్‌ శాసనసభ్యులు సంజయ్‌ఖాన్‌కు చెందిన ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో ఉన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X