వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందూజాలపై చార్జిషీటు కొట్టివేత

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 640మిలియన్ల బోఫోర్స్‌ చెల్లింపు కేసులో ముగ్గురు హిందూజా సోదరులపై దాఖలయిన చార్జిషీట్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. దాఖలు చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ ఆమోదం తీసుకోకపోవడంతో చార్జిషీటును కొట్టివేయాలని హిందూజా సోదరులు పిటిషన్‌పెట్టుకున్నారు. ఈ పిటిషన్‌ను అనుమతిస్తూ చార్జిషీటును కొట్టి వేసినట్లు జస్టిస్‌ ఆర్‌.ఎస్‌. సోధీ చెప్పారు.

చట్టప్రకారం సిబిఐ తాజాగా చార్జిషీటును దాఖలు చేసేవీలుంటుంది. వినీత్‌ నారాయణ్‌ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా సిబిఐ తాజా చార్జిషీటు దాఖలు చేయాలని జడ్జి సూచించారు. సిబిఐ,సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ తమ చట్టపరమైన విధులను నిర్వర్తించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. హిందూజా సోదరులకు సుప్రీంకోర్టు ఇచ్చిన షరతులతో కూడిన బెయిల్‌ కొనసాగుతుందని జడ్జి సోధి చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X