వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన 17వ విడత జన్మభూమి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌ అంతటా పల్లె పల్లెనా ఈ నెల 1 నుంచి పదిరోజుల పాటు నిర్వహించిన జన్మభూమి కార్యక్రమలు సోమవారం ముగిశాయి. 17వ విడత జన్మభూమిని రైతు, మహిళా జన్మభూమిగా ప్రభుత్వం ప్రకటించింది. పదిరోజుల పాటు జరిగిన జన్మభూమిలో ప్రభుత్వం పలు అభివృద్ధి పథకాలు ప్రకటించింది. స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు దాదాపు అన్ని జిల్లాల్లో పర్యటించారు. కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు చేయకుండా బాలికలకువిద్య, ఎయిడ్స్‌ నివారణ, కుటుంబ నియంత్రణ ఆవశ్యకతలనువివరిస్తూ చంద్రబాబు నాయుడు ఆసక్తికరంగా గ్రామసభలు నిర్వహించారు.

కొన్ని చోట్ల జన్మభూమి సభలు రసాభాసగా మారినప్పటికీ పలు ప్రాంతాల్లో స్థానిక సమస్యల పరిష్కారానికి ఇది మహదవకాశంగా మారింది. ఈ పదిరోజుల్లో సుమారు 2లక్షల వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ చేశారు. గత 16 విడతల జన్మభూమి కార్యక్రమాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ప్రజలు పలు చోట్ల అధికారులను నిలదీశారు. ఏది ఏమైనా రాష్ట్రప్రజలు తమ సమస్యలను నివేదించుకొనేందుకు జన్మభూమి ఒక వేదికగా నిలిచింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X