వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముగిసిన 17వ విడత జన్మభూమి
హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ అంతటా పల్లె పల్లెనా ఈ నెల 1 నుంచి పదిరోజుల పాటు నిర్వహించిన జన్మభూమి కార్యక్రమలు సోమవారం ముగిశాయి. 17వ విడత జన్మభూమిని రైతు, మహిళా జన్మభూమిగా ప్రభుత్వం ప్రకటించింది. పదిరోజుల పాటు జరిగిన జన్మభూమిలో ప్రభుత్వం పలు అభివృద్ధి పథకాలు ప్రకటించింది. స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు దాదాపు అన్ని జిల్లాల్లో పర్యటించారు. కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు చేయకుండా బాలికలకువిద్య, ఎయిడ్స్ నివారణ, కుటుంబ నియంత్రణ ఆవశ్యకతలనువివరిస్తూ చంద్రబాబు నాయుడు ఆసక్తికరంగా గ్రామసభలు నిర్వహించారు.
Comments
Story first published: Monday, June 10, 2002, 23:53 [IST]