చర్చలు నిర్మాణాత్మకంగా సాగాలి: దిగ్విజయ్
హైదరాబాద్:
హింసను
విడనాడితేపీపుల్స్వార్పై
నిషేధాన్ని
ఎత్తేయవచ్చునని
మధ్యప్రదేశ్
ముఖ్యమంత్రి
దిగ్విజయ్
సింగ్
అన్నారు.
రాజ్యాంగాన్ని
గౌరవించి
నక్సలైట్లు
ముందుగా
జన
జీవన
స్రవంతిలోకి
రావాలని,
ప్రజాస్వామ్య
ప్రక్రియలో
పాలు
పంచుకోవాలని
ఆయన
సూచించారు.
అధికారిక
పర్యటన
నిమిత్తం
తమిళనాడు
నుంచి
సోమవారం
ఇక్కడికి
వచ్చిన
ఆయనవిమానాశ్రయంలో
విలేకరులతో
మాట్లాడారు.
రైతులకు
ఉచిత
విద్యుత్
ఇవ్వవచ్చునని,
అయితేవిద్యుత్
బోర్డుపై
భారం
పడకుండా
ఆ
సొమ్మును
ప్రభుత్వం
చెల్లించాల్సి
వుంటుందని,
అవిభక్త
మధ్యప్రదేశ్
రాష్ట్రంలో
తాము
ఏడేళ్ల
పాటు
ఉచితవిద్యుత్
అందించామని
ఆయన
చెప్పారు.
ఉచిత
విద్యుత్
సరఫరా
వల్లపెద్ద
ఖర్చేమీ
వుండదని,
రాష్ట్ర
పునర్విభజన
తర్వాత
ప్రధానమైనవిద్యుదుత్పత్తి
కేంద్రాలు
ఎక్కవగా
ఛత్తీస్ఘడ్
రాష్ట్రానికి
వెళ్లిపోయాయని,
దాంతో
ప్రస్తుతం
తాము
ఉచితవిద్యుత్
అందించలేక
పోతున్నామని
ఆయన
అన్నారు.
జన్మభూమి
కార్యక్రమాన్ని
తాను
లోతుగా
అధ్యయనం
చేయలేదని,అందువల్ల
తానేమీ
చెప్పలేనని
దిగ్విజయ్
సింగ్
అన్నారు.
జన్మభూమిలో
ప్రజల
భాగస్వామ్యం,
స్థానిక
సంస్థల
భాగస్వామ్యంపెరగాలని,
అధికారుల
పాత్ర
తగ్గాలని,
ఆంధ్రప్రదేశ్లోని
తమ
నాయకులు
కోరుతున్నది
ఇదేనని
ఆయన
అన్నారు.