వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్చలు నిర్మాణాత్మకంగా సాగాలి: దిగ్విజయ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హింసను విడనాడితేపీపుల్స్‌వార్‌పై నిషేధాన్ని ఎత్తేయవచ్చునని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించి నక్సలైట్లు ముందుగా జన జీవన స్రవంతిలోకి రావాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలు పంచుకోవాలని ఆయన సూచించారు. అధికారిక పర్యటన నిమిత్తం తమిళనాడు నుంచి సోమవారం ఇక్కడికి వచ్చిన ఆయనవిమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నక్సల్స్‌తో జరుపుతున్న చర్చలు నిర్మాణాత్మకంగా, ప్రజలకు ప్రయోజనం కలిగించే రీతిలో వుండాలని ఆయన అభిప్రాయపడ్డారు. నక్సలైట్లపై నిషేధం ఎత్తివేసేవిషయంలో వివిధ రాష్ట్రాలకు విభిన్న వైఖరులుంటాయని ఆయన అన్నారు. నక్సల్స్‌ హింసా మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావు లేదని ఆయన అన్నారు.

రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వవచ్చునని, అయితేవిద్యుత్‌ బోర్డుపై భారం పడకుండా ఆ సొమ్మును ప్రభుత్వం చెల్లించాల్సి వుంటుందని, అవిభక్త మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో తాము ఏడేళ్ల పాటు ఉచితవిద్యుత్‌ అందించామని ఆయన చెప్పారు. ఉచిత విద్యుత్‌ సరఫరా వల్లపెద్ద
ఖర్చేమీ వుండదని, రాష్ట్ర పునర్విభజన తర్వాత ప్రధానమైనవిద్యుదుత్పత్తి కేంద్రాలు ఎక్కవగా ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రానికి వెళ్లిపోయాయని, దాంతో ప్రస్తుతం తాము ఉచితవిద్యుత్‌ అందించలేక పోతున్నామని ఆయన అన్నారు.

జన్మభూమి కార్యక్రమాన్ని తాను లోతుగా అధ్యయనం చేయలేదని,అందువల్ల తానేమీ చెప్పలేనని దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. జన్మభూమిలో ప్రజల భాగస్వామ్యం, స్థానిక సంస్థల భాగస్వామ్యంపెరగాలని, అధికారుల పాత్ర తగ్గాలని, ఆంధ్రప్రదేశ్‌లోని తమ నాయకులు కోరుతున్నది ఇదేనని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X