వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూంఛ్‌ ఎయిర్‌పోర్టుకు పాక్‌ దాడుల తాకిడి

By Staff
|
Google Oneindia TeluguNews

జమ్మూ: పాకిస్థాన్‌ బలగాలు జమ్మూ డివిజన్‌లోని పూంఛ్‌ జిల్లాల్లో జరుపుతున్న దాడుల తాకిడికి మంగళవారం పూంఛ్‌విమానాశ్రయం గురైంది . పాక్‌ బలగాలు సోమవారం నుంచి జరుపుతున్న దాడుల్లో ఒక మహిళతో పాటు ముగ్గురు పౌరులు గాయపడ్డారు.

పాకిస్థాన్‌ బలగాలు దాడులు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ప్రారంభమైనట్లు, పూంఛ్‌విమానాశ్రయం కూడా ఈ దాడుల తాకిడికి గురైనట్లు అధికార వర్గాలు చెప్పాయి.విమానాశ్రం దెబ్బ తినలేదని ఆ వర్గాలు చెప్పాయి. పాక్‌ దాడులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. పరస్పర దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

పాకిస్థాన్‌ బలగాలు పూంఛ్‌ పట్టణాన్ని, ఖారి-కార్మరా,జల్లాస్‌, సలోత్రి, డల్లాన్‌, మాల్తి, మెగ్నార్‌ లక్ష్యంగా ఎంచుకుని సోమవారం సాయంత్రం ఆరు గంటల ఉంచి పదిన్నర గంటల వరకు మోర్టార్‌ బాంబులను ప్రయోగించాయి. ఈ దాడుల్లో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. మరో పౌరుడు సోమవారం రాత్రి మెంధార్‌ తహిసీల్‌లో గాయపడ్డాడు. పరస్పరఫిరంగి, మోర్టార్‌ బాంబుల ప్రయోగాలు సియాచిన్‌ గ్లేసియర్‌, ద్రాస్‌, బాటాలిక్‌, కృష్ణగట్టి, పూంఛ్‌, నౌషేరా, ఆర్‌.ఎస్‌. పురా ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి కొనసాగుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X